చంద్రబాబుకు సంచయిత గజపతిరాజు కౌంటర్!
ఆంధ్రప్రదేశ్: పద్మనాభస్వామి గుడి భాద్యతలను రాజవంశీలకు చందేలా సుప్రీమ్ కోర్ట్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పును ఉద్దేశించి ట్విట్టర్ లో కామెంట్ చేసిన చంద్రబాబు నాయుడు దానిని సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు, మన్సాస్ ట్రస్ట్ బోర్డుతో ముడిపెట్టడం గమనార్హం. వీటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జ్యోక్యం చేసుకోవటం మానాలని చంద్రబాబు అన్నారు. అయితే సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు, మన్సాస్ ట్రస్ట్ బోర్డులకు చైర్పర్సన్ గా వున్న సంచయిత గజపతిరాజు కౌంటర్ ఇచ్చారు.

సంచయిత గజపతిరాజు ట్విట్టర్ ద్వారా, నేను గజపతి వంశానికి చట్టబద్ధ వారసుడైన ఆనంద గజపతికి తాను వారసురాలినన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలన్నారు. మా చిన్నాన్న అశోక్ గజపతిరాజులా చంద్రబాబు లింగ వివక్ష చూపరని భావిస్తున్నానని పేర్కొన్నారు. అలాగే తమ కుటుంబ వ్యవహారాలలో జ్యోక్యం తగదని, రాజకీయం చేయడం మానుకోవాలని చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు.
అసలు చంద్రబాబు ఏమన్నారు:
AP ప్రభుత్వం సుప్రీమ్ కోర్ట్ తీర్పును గమనించాలి మరియు సింహాచలం బోర్డు & మాన్సాస్ ట్రస్ట్ యొక్క నిర్వాహణలో జోక్యం చేసుకోవడం మానేయాలి. సంరక్షకులుగా గజపతి కుటుంబ హక్కులు పరిరక్షించబడాలి. వైస్ జగన్ మురికి రాజకీయాలు మానేయాలి, దేవుడు & వంశపారంపర్యంగా నడిచే ట్రస్టులతో జోక్యం చేసుకోకూడదు.
సంచయిత గజపతిరాజు కౌంటర్ ట్వీట్స్:
సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్గా నన్ను నియమించడంద్వారా గజపతి కుటుంబీకులకున్న సంరక్షక హక్కులను కాపాడారు. మా తాతగారు పీవీజీ రాజుగారికి పెద్దకుమారుడిగా ఆనందగజపతిరాజుగారికి, వారి పెద్ద సంతానంగా నాకు వారసత్వపు హక్కులు లభించాయి.
అశోక్గజపతిరాజుగారిలా కాకుండా చంద్రబాబునాయుడుగారు పురుషులతోపాటు మహిళలకూ సమానంగా హక్కులు ఉంటాయని గుర్తించారనే అనుకుంటున్నా. నేను లేను అన్నట్టుగా, మొత్తం గజపతుల కుటుంబానికి తానే వారసుడ్ని అన్నట్టుగా అశోక్గారు తప్పుదోవపట్టిస్తున్నారు.
గజపతుల కుటుంబ వ్యవహారాలను రాజకీయం చేయకుండా వీటికి చంద్రబాబుగారు దూరంగా ఉంటారని ఆశిస్తున్నాను.
విజయసాయి రెడ్డి కౌంటర్ ట్వీట్:
ఇదే విషయంపై విజయసాయి రెడ్డి ట్వీట్ చేస్తూ, విజయనగరం గజపతుల కుటుంబ వ్యవహారాలు ట్రస్ట్ లో జగన్ గారి ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదు. ఇన్నాళ్లు జోక్యం చేసుకుని దోచేసింది నువ్వే CBN. సంబంధంలేని విషయాల్లో కాలు , వేలు పెట్టి ఎందుకు తిట్టించుకుంటావ్? సంచయిత గజపతుల కుటుంభ సభ్యురాలు కాదా ? లేక మహిళలంటే నీకు చిన్న చూపా?
తిరుమల: శ్రీవెంకటేశ్వరస్వామికి అజ్ఞాత భక్తుడు 20 బంగారు బిస్కెట్ల విరాళం

సంచయిత గజపతిరాజు ట్విట్టర్ ద్వారా, నేను గజపతి వంశానికి చట్టబద్ధ వారసుడైన ఆనంద గజపతికి తాను వారసురాలినన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలన్నారు. మా చిన్నాన్న అశోక్ గజపతిరాజులా చంద్రబాబు లింగ వివక్ష చూపరని భావిస్తున్నానని పేర్కొన్నారు. అలాగే తమ కుటుంబ వ్యవహారాలలో జ్యోక్యం తగదని, రాజకీయం చేయడం మానుకోవాలని చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు.
అసలు చంద్రబాబు ఏమన్నారు:
AP ప్రభుత్వం సుప్రీమ్ కోర్ట్ తీర్పును గమనించాలి మరియు సింహాచలం బోర్డు & మాన్సాస్ ట్రస్ట్ యొక్క నిర్వాహణలో జోక్యం చేసుకోవడం మానేయాలి. సంరక్షకులుగా గజపతి కుటుంబ హక్కులు పరిరక్షించబడాలి. వైస్ జగన్ మురికి రాజకీయాలు మానేయాలి, దేవుడు & వంశపారంపర్యంగా నడిచే ట్రస్టులతో జోక్యం చేసుకోకూడదు.
సంచయిత గజపతిరాజు కౌంటర్ ట్వీట్స్:
సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్గా నన్ను నియమించడంద్వారా గజపతి కుటుంబీకులకున్న సంరక్షక హక్కులను కాపాడారు. మా తాతగారు పీవీజీ రాజుగారికి పెద్దకుమారుడిగా ఆనందగజపతిరాజుగారికి, వారి పెద్ద సంతానంగా నాకు వారసత్వపు హక్కులు లభించాయి.
అశోక్గజపతిరాజుగారిలా కాకుండా చంద్రబాబునాయుడుగారు పురుషులతోపాటు మహిళలకూ సమానంగా హక్కులు ఉంటాయని గుర్తించారనే అనుకుంటున్నా. నేను లేను అన్నట్టుగా, మొత్తం గజపతుల కుటుంబానికి తానే వారసుడ్ని అన్నట్టుగా అశోక్గారు తప్పుదోవపట్టిస్తున్నారు.
గజపతుల కుటుంబ వ్యవహారాలను రాజకీయం చేయకుండా వీటికి చంద్రబాబుగారు దూరంగా ఉంటారని ఆశిస్తున్నాను.
విజయసాయి రెడ్డి కౌంటర్ ట్వీట్:
ఇదే విషయంపై విజయసాయి రెడ్డి ట్వీట్ చేస్తూ, విజయనగరం గజపతుల కుటుంబ వ్యవహారాలు ట్రస్ట్ లో జగన్ గారి ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదు. ఇన్నాళ్లు జోక్యం చేసుకుని దోచేసింది నువ్వే CBN. సంబంధంలేని విషయాల్లో కాలు , వేలు పెట్టి ఎందుకు తిట్టించుకుంటావ్? సంచయిత గజపతుల కుటుంభ సభ్యురాలు కాదా ? లేక మహిళలంటే నీకు చిన్న చూపా?
తిరుమల: శ్రీవెంకటేశ్వరస్వామికి అజ్ఞాత భక్తుడు 20 బంగారు బిస్కెట్ల విరాళం
Comments
Post a comment