భూ రికార్డుల తారుమారు కేసులో తుళ్లూరు మాజీ తహసీల్దార్ అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ (అమరావతి): రాజధాని అమరావతి గ్రామాల పరిధిలోని భూ రికార్డుల తారుమారు కేసులో తుళ్లూరు మాజీ తహసీల్దార్ సుధీర్ బాబును పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనతో పాటుగా దళితులు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములను నిభందనలు విరుద్దంగా తక్కువ రేటుకు కొనుగోలు చేసిన గుమ్మడి సురేషును కూడా అరెస్ట్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి గుమ్మడి సురేషుకు మాజీ తహసీల్దార్ సుధీరు బాబు సహకరించిటం జరిగింది. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన వీరిద్దరినీ 14 రోజుల పాటు రిమాండుతో గుంటూరు సబ్ జైలుకు తరలించారు.

అసలు భూ రికార్డుల తారుమారు ఎలా జరిగింది?
అయితే విచారణాధికారుల పరిశీలనలో మరిన్ని లోపాలు వెలుగుచూశాయి. అనంతవరం, నేలపాడు, వెలగపూడి, రాయపూడి, పెదలంక తదితర గ్రామాల్లోని మరో తొమ్మిది సర్వే నంబర్లలో భూ రికార్డుల తారుమారు జరిగిందని పరిశీలనలో తేలింది.
ఇంకా చదవండి:
పెన్షన్ని అందుకుంటున్న మహిళలకు కూడా ‘వైఎస్సార్ చేయూత’

అసలు భూ రికార్డుల తారుమారు ఎలా జరిగింది?
- రాజధాని నిర్మాణం పేరిట గత ప్రభుత్వం 29 గ్రామాల పరిధిలో 33 వేల ఎకరాలను సేకరించిన సంగతి తెలిసిందే.
- తుళ్లూరు మండలం రాయపూడిలోని పెదలంకలో సర్వే నంబర్ 376/2ఎలో 3.70 ఎకరాలను 1975లో నాటి ప్రభుత్వం అసైన్డ్ ల్యాండ్ కింద ఎస్సీలకు పంపిణీ చేసింది
- గత ప్రభుత్వ హయాంలో తహసీల్దార్గా పనిచేసిన సుధీర్ బాబు ఈ అసైన్డ్ భూమిని పట్టా భూమిగా మార్పు చేసి ఆన్లైన్ ద్వారా వెబ్ ల్యాండ్లోకి ఎక్కించారు
- రియల్ ఎస్టేట్ వ్యాపారి గుమ్మడి సురేష్ అందులో 86 సెంట్ల భూమిని కొనుగోలు చేసి వేరే వ్యక్తికి విక్రయించాడు
- అయితే తుళ్లూరు మాజీ తహసీల్దార్ సుధీర్ బాబు రియల్ ఎస్టేట్ వ్యాపారి గుమ్మడి సురేషుతో కలిసి రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి భూమిని ల్యాండ్పూలింగ్ కింద సీఆర్డీఏకు ఇవ్వడం చేశారని విచారణాధికారుల పరిశీలనలో తేలింది
- ఈ అవకతవకలను కొత్త తహసీల్దారుగా బాధ్యతలు చేపట్టిన పూర్ణచంద్రరావు గుర్తించి కలెక్టర్కుఫిర్యాదు చేయడం జరిగింది
అయితే విచారణాధికారుల పరిశీలనలో మరిన్ని లోపాలు వెలుగుచూశాయి. అనంతవరం, నేలపాడు, వెలగపూడి, రాయపూడి, పెదలంక తదితర గ్రామాల్లోని మరో తొమ్మిది సర్వే నంబర్లలో భూ రికార్డుల తారుమారు జరిగిందని పరిశీలనలో తేలింది.
ఇంకా చదవండి:
పెన్షన్ని అందుకుంటున్న మహిళలకు కూడా ‘వైఎస్సార్ చేయూత’
Comments
Post a comment